సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డీజే టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డీజే టిల్లు’ సినిమాకు అన్ని చోట్ల నుంచి సానుకూల స్పందన తెచ్చుకుందని చెబుతున్నారు చిత్ర బృందం. విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…“డీజే టిల్లు’కు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మేము ఆశించినదానికంటే బాగా ప్రేక్షకులు స్పందిస్తున్నారు. మాటలు నేనే రాసుకోవడంతో పాటు స్థానికంగా పెరిగిన వాడిని కాబట్టి టిల్లు పాత్రను సహజంగా పోషించగలిగాను’. అన్నారు. ‘కథ విన్నప్పుడు కలిగిన నమ్మకం ఇవాళ నిజమైందని, మా సంస్థలో మరింత మంది కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు ‘డీజే టిల్లు’ విజయం ధైర్యాన్నిచ్చిందని, మేము నిర్మించే ఏ సినిమా అయినా సంస్థ గౌరవాన్ని కాపాడేలా ఉంటుందని’ అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ..‘థియేటర్ దగ్గర ప్రేక్షకుల సందడి చూస్తుంటే ఆనందంగా ఉంది. మేము ఇంత క్రేజ్ సృష్టించామా అనిపిస్తోంది’ అన్నారు. అనంతరం చిత్రబృందం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.