‘లోఫర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఎం.ఎస్.ధోనీ’ ‘భాగీ’ సిరీస్ సినిమాలతో మంచి విజయాల్ని అందుకుంది. యువతరంలో కూడా ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో బంపరాఫర్ను దక్కించుకుంది. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-కె’ (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో దీపికాపడుకోన్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలో రెండో నాయికగా దిశాపటానీని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. చిత్ర యూనిట్ తనకు స్వాగతం చెబుతూ పంపించిన పుష్పగుచ్ఛం ఫొటోను షేర్ చేసింది. ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడం పట్ల దిశాపటానీ ఆనందం వ్యక్తం చేసింది. ‘ప్రాజెక్ట్-కె’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.