బాధ్యతారాహిత్యంగా పెరిగిన కొడుకు సమాజానికి కీడుగా మారితే, ఆ తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ తండ్రీకొడుకుల మధ్య జరిగే సంఘర్షణ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా రూపొందిన చిత్రం ‘డర్టీ ఫెలో’. శాంతిచంద్ర, దీపికా సింగ్, సిమ్రితి ప్రధానపాత్రధారులు. ఆడారి మూర్తిసాయి దర్శకుడు. జి.ఎస్.బాబు నిర్మాత. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హీరో శ్రీకాంత్, దర్శకుడు వీరశంకర్ అతిథులుగా హాజరై చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు.
సినిమా పేరు నెగెటివ్గా ఉన్నా, సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమా ఇదని, పిల్లల్ని బాధ్యతగా తల్లిదండ్రులు, గురువులు తీర్చిదిద్దకపోతే.. సమాజానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో ఈ సినిమా చెబుతుందని హీరో శాంతిచంద్ర చెప్పారు.