హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకున్నది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఆర్ ఆర్ మదన్ కన్నుమూశారు. నాలుగు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్కు గురవగా.. కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. మదన్ ‘పెళ్లయిన కొత్తలో’, గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’, ‘కాఫీ విత్ వైఫ్’, ‘గాయత్రి’, ‘గరం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఆ నలుగురు’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లేను అందించారు. మదన్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లి. మదన్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖలు సంతాపం ప్రకటించారు.