Director Ram Gopal Varma | ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని తెలిపారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చ జరగలేదు. టికెట్ల ధరల కేటాయింపుపై ఎవరికీ అధికారం ఉండకూడదు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించాను. ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని చెప్పాను. పక్క రాష్ట్రాలు, ఉత్తర భారత్లో పరిస్థితి ఎలా ఉందో చెప్పాను.
టికెట్ ధరలు పెరిగితే జనం ఇబ్బంది పడుతారని ఏపీ మంత్రి చెప్పారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను అని ఆర్జీవీ పేర్కొన్నారు. ఒక ఫిల్మ్ మేకర్గా తన అభిప్రాయాన్ని చెప్పాను. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నానని ఆర్జీవీ పేర్కొన్నారు.
తాను ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల తరపున చర్చలకు రాలేదు. థియేటర్ల మూసివేత తనకు సంబంధించిన అంశం కాదు. రేట్ల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటోంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారని అనుకోవట్లేదు. మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా జరిగాయని ఆర్జీవీ స్పష్టం చేశారు.