Ranveer Singh | ‘హను-మాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్వర్మ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన సీక్వెల్ ‘జై హనుమాన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్సింగ్తో ప్రశాంత్వర్మ భారీ పాన్ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
‘హనుమాన్’ సినిమా రణవీర్సింగ్కు బాగా నచ్చిందని, దాంతో ప్రశాంత్వర్మతో సినిమా చేయడానికి ఆయన ఆసక్తిని చూపించారని అంటున్నారు. ఇటీవలే వీరిద్దరి మధ్యలో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, పౌరాణిక నేపథ్యంతో పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని చెబుతున్నారు. ఇక ‘హనుమాన్’కు సీక్వెల్గా రూపొందబోతున్న ‘జై హనుమాన్’ త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.