1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నరసింహ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలు. సోమవారం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. షేక్స్పియర్ కథలోని పాత్రలను ఆధారంగా తీసుకొని తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని..
పగ, ద్వేషం, అసూయ, ప్రేమ వంటి వివిధ భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగుతుందని, 1980ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టామని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. మూడేళ్లు ఎంతగానో శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించామని, తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్, రచన-దర్శకత్వం: నరసింహ నంది.