పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం చాలా గొప్పదని ప్రశంసించారు దర్శకుడు అశ్విన్ గంగరాజు. సంగీత దర్శకుడు కాలభైరవ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన ఆయన శుక్రవారం జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు.
తన పుట్టినరోజున ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగమవడం ఆనందంగా ఉందన్న అశ్విన్ గంగరాజు.. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్విన్ గంగరాజుతో పాటు నటుడు అదిరే అభి పాల్గొన్నారు. అనంతరం ఆయన హాస్య నటులు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, హీరో శర్వానంద్కు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.