స్వయంవరం, నువ్వేకావాలి, మన్మథుడు వంటి చిత్రాలతో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు కె.విజయ్భాస్కర్ సుదీర్ఘ విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘జిలేబి’ బుధవారం ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీకమల్ హీరోగా పరిచమయవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తున్నది. గుంటూరు రామకృష్ణ, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్నివ్వగా, హీరో రాజశేఖర్ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. వినోదప్రధానంగా వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, గెటప్ శ్రీను, మిర్చి కిరణ్, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, ఆర్ట్: పి.సంపత్రావు, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: గుంటూరు రామకృష్ణ, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచన-దర్శకత్వం: విజయ్భాస్కర్ కె.