కథానాయకుడు త్రిగున్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిరాయి’. వీఆర్కే (రామకృష్ణ) దర్శకుడు. అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్లుక్ను హీరో త్రిగున్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.
చిత్ర దర్శకుడు వీఆర్కే మాట్లాడుతూ ‘గుంటూరు బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రమిది. కిరాయి హత్యల నేపథ్యంలో చిత్ర కథ ఉంటుంది. కిరాయి తీసుకోకుండా హీరో కిరాయి హత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు? ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ చిత్ర కథ’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర