Jeevi-2 Movie | తమిళ హీరో వెట్రీ హీరోగా వీజే గోపినాథ్ దర్శకత్వంలో జీవీ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్ర సీక్వెల్ జీవీ-2 తెరకెక్కింది. అయితే ఈ చిత్ర కథను దర్శకుడు రెండు రోజుల్లోనే కథను రాశాడని వెల్లడించాడు. అయితే జీవీ చిత్రానికి కథ, సంభాషణలు రచయిత బాబు తమిళ్ రాశారని చెప్పాడు. దానికి సీక్వెల్ చేయాలని భావించినప్పుడు రచయిత బాబు తమిళ్ను సంప్రదించగా జీవీ చిత్రానికి సీక్వెల్ అవకాశమే లేదని చెప్పడంతో తానే కథను తయారు చేయడానికి సిద్ధమయ్యానని వెల్లడించాడు.
ఈ క్రమంలో జీవీ-2 కథ రాయడం మొదలుపెట్టానని, కేవలం రెండు రోజుల్లోనే ఈ కథను పూర్తి చేశానని వెల్లడించాడు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయిని తెలిపారు. క్రైమ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన జీవి చిత్రం తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.