వరుస హిట్లతో విజయానికి చిరునామా అయ్యారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 2’తో సకుటుంబ ప్రేక్షకుల్ని నవ్వించిన ఆయన..ఆ ఫ్రాంఛైజీని కొనసాగిస్తూ ‘ఎఫ్ 3’ని తెరపైకి తీసుకొస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
ఫ్రాంఛైజీ మూవీ కాబట్టి ఒక్కసారిగా కొత్త పాత్రలను తీసుకొస్తే ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. అందుకే ఆ సినిమాలో బాగా పేరొచ్చిన పాత్రలను తీసుకుని కథను కొత్తగా చెప్పాం. గత సినిమా భార్యా భర్తల మధ్య ఫ్రస్ట్రేషన్ అయితే ఇది డబ్బు గురించిన ఫ్రస్ట్రేషన్. దాని కంటే ఇది ఇంకా ఎక్కువ కామెడీగా డబ్బు కోసం పడే దురాశ, వేసే ఎత్తులు బాగా నవ్విస్తాయి.
కథానాయకుల పాత్రలకు ఇంకా ఫన్ ఎలిమెంట్స్ ఉంటే బాగుండును అనిపించింది. నత్తి, రేచీకటి అలా పెట్టాల్సివచ్చింది. ఈ లోపాల వల్ల చాలా సన్నివేశాల్లో వినోదం పెరిగింది. వీటి మీదే ఆధారపడి హీరోల పాత్రలు సాగవు. రాత్రి సన్నివేశం వచ్చినప్పుడు రేచీకటి అనేది వాడుకున్నాం. వరుణ్ తేజ్ నత్తితో మాట్లాడిన ప్రతిసారీ ఓ కొత్త మేనరిజం పెట్టాం. ఈ కొత్త కొత్త మేనరిజమ్స్ క్రియేట్ చేయడంకోసం కష్టపడాల్సి వచ్చింది.
సినిమాలోని పాత్రలన్నీ డబ్బు వేటలో ఉంటాయి. మీరు పోస్టర్స్లో చూస్తే గొడుగుల నిండా డబ్బులు పోగేస్తున్నారు. డబ్బు ఎలా త్వరగా సంపాదించాలని వారంతా ప్రయత్నిస్తుంటారు. వాళ్ల దురాశ నుంచే వినోదం పుట్టుకొస్తుంది.
గత సినిమాలో చివరిదాకా నవ్విస్తూ చివరలో భార్యా భర్తల మధ్య బంధం ఎలా ఉండాలో చూపించాం. ఈ సినిమాలో డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుతో ఎలా వ్యవహరించాలి అనేది చెబుతున్నాం. సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకులకు ఇదొక మంచి విషయంగా గుర్తుంటుంది.
ప్రేక్షకులను నవ్విస్తే చాలు ఆ సినిమా విజయం సాధించినట్లే. అది చిన్న సినిమా అయినా ఫర్లేదు. నవ్వించే ఏ సినిమా ఫెయిల్ కాదు. ప్రేక్షకులు వినోదానికి స్పందించినప్పుడు చిన్న చిన్న తప్పులు ఉన్నా మర్చిపోతారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. బాలీవుడ్లో ‘గోల్మాల్’ ఫ్రాంఛైజీలాగ మనకు ఇది నిలుస్తుంది.
సినిమాలోని ముగ్గురు నాయికలతో ఓ పాట చిత్రీకరించాం. అలాంటి సెలబ్రేషన్ పాట సినిమా చివరలో వస్తుంది. మళ్లీ ఆ నాయికలతోనే చేయిస్తే రిపీట్ అయినట్లు ఉంటుందని ఓ స్టార్ హీరోయిన్ను పెట్టాలని అనుకున్నాం. అలా పూజా హెగ్డే మా ప్రాజెక్ట్లోకి వచ్చింది.
ఆరేళ్లుగా రాజు గారితో ప్రయాణం చేస్తున్నాను. ఆయనతో పనిచేయడం కంఫర్ట్గా ఉంటుంది. సినిమాకు ఏదైనా కావాలంటే ఫోన్ చేస్తే చాలు పని అవుతుంది. కలవాల్సిన పనికూడా ఉండదు.
ఆ స్థానం ఖాళీ ఉంటే అక్కడకు వెళ్లడం మంచిదే కదా. అయితే దర్శకుడిగా మారినప్పుడు నాకు మాస్ సినిమాలు చేయాలని ఉండేది. నా మొదటి మూడు సినిమాలు అలాగే చేశాను. వాటిలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. నా సినిమాల స్థాయి పెరగాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని అనిపించింది అందుకే ‘ఎఫ్ 2’ చేశా. ఆ సినిమా నా గత చిత్రాల వసూళ్లను దాటేసింది.
తెరపై ఆయన పవర్ను పెంచే సినిమానే అవుతుంది. నా తరహా వినోదం కూడా ఉంటుంది. ఒక కొత్త జానర్లో మేం సినిమా చేయబోతున్నాం.
నా సినిమాలన్నింటిలో కామెడీతో పాటు ఏదో ఓ మంచి విషయాన్ని చెబుతూ వచ్చాం. ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆర్మీ గొప్పదనం చూపించాం. ఇందులోనూ కథకు ఆత్మలాంటి విషయం ఉంటుంది. ప్రేక్షకులు దానికి కనెక్ట్ అయినప్పుడే సినిమా ఘనవిజయం సాధిస్తుంది.