దిలీప్ కుమార్, రెజీనా జంటగా నటిస్తున్న సినిమా ‘ఉత్సవం’. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాటకరంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల జీవితాల నేపథ్యంతో రూపొందించారు దర్శకుడు అర్జున్ సాయి. సురేష్ పాటిల్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది.
త్వరలో విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ…‘ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది నాటకరంగం. ఆ స్వర్ణయుగంలో కళాకారులు గొప్ప గౌరవాన్ని పొందారు. ఇప్పుడు నాటకరంగ అంతరించి పోతున్నది. ఈ పరిణామాన్ని కథగా చూపిస్తూ ఉత్సవం సినిమాను తెరకెక్కించాం’ అన్నారు.