‘ధూమ్’ చిత్రంతో హిందీ చిత్రసీమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సంజయ్ గాధ్వి (56) ఆదివారం ఉదయం ముంబయిలో గుండెపోటుతో కన్నుమూశారు. ‘తేరే లియే’ చిత్రంతో బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయమైన సంజయ్ గాధ్వి ‘ధూమ్’ ‘ధూమ్-2’ చిత్రాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు పొందారు. మేరే యాద్ కి షాదీ హై, కిడ్నాప్, అజబ్ గజబ్ లవ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
2020లో విడుదలైన ‘ఆపరేషన్ పరిందే’ ఆయన చివరి చిత్రం. సంజయ్ గాధ్వి ఆకస్మిక మరణం పట్ల ‘ధూమ్’ చిత్ర బృందంతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.