చేతన్కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్ స్టోరీ, స్క్రీన్ప్లే అందించారు. రామ్కుమార్ నిర్మాత. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ చిత్ర టీజర్ను హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీనువైట్ల విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ బాగుందని, తన దగ్గర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన గోపీమోహన్ కథ, స్క్రీన్ప్లే ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచిందని అన్నారు.
నిర్మాత రామ్కుమార్ సినిమా అంటే మంచి పాషన్ కలిగిన ప్రొడ్యూసర్ అని, గోపీమోహన్ మంచి కథనిచ్చారని హీరో గోపీచంద్ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్.రామ్కుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, దర్శకత్వం:! సాయికిషోర్ మచ్చా.