ముంబై : బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) శుక్రవారం తన 88వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. ధర్మేంద్ర బర్త్డే సందర్భంగా జుహులోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. తండ్రి ధర్మేంద్ర బర్త్డే సందర్భంగా ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ శుభాకాంక్షలు తెలిపారు.
కుమారుల సమక్షంలో ధర్మేంద్ర భారీ బర్త్డే కేక్ను కట్ చేశారు. సినీ పరిశ్రమలో దిగ్గజాల వంటి దర్శక నిర్మాతలతో పనిచేసిన ధర్మేంద్ర తన సుదీర్ఘ సినీ కెరీర్లో ఫూల్ ఔర్ పత్తర్, షోలే, చుప్కే చుప్కే, యాదోంకీ బారాత్, సీతా ఔర్ గీఆ, ధరంవీర్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు.
హేమమాలిని, మీనా కుమారి, సైరా బాను వంటి ప్రముఖ నటీమణులతో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ధర్మేంద్ర చివరి సారిగా కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని మూవీలో రణ్వీర్ సింగ్ తాతగా కనిపించారు.
Read More :