కొందరు సెలబ్రిటీలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టమే. కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ధనుష్ (Dhanush) 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు విడాకులివ్వడం కూడా అలాంటి విషయమే. ధనుష్-ఐశ్వర్య (Dhanush-Aishwarya) విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత అటు ధనుష్ కానీ, ఇటు ఐశ్వర్య కానీ సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ఎలాంటి డిస్కషన్స్ చేయలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలున్నాయని చాలా మంది నెటిజన్లు ఊహించుకోవడం మొదలుపెట్టారు.
అయితే వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఐశ్వర్య గురించి ఓ పోస్ట్ను షేర్ చేశాడు ధనుష్. పాయని (Payani music video) అనే మ్యూజిక్ వీడియోతో డైరెక్టర్గా కమ్ బ్యాక్ ఎంట్రీ ఇస్తోంది ఐశ్వర్య. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. నీ మ్యూజిక్ వీడియో చూశారు. కంగ్రాట్స్..నీకు ఆ దేవుడి దీవెనలుండాలి..అని ట్వీట్ చేశాడు. దీనికి ధన్యవాదాలు ధనుష్.. అంటూ రీట్వీట్ చేసింది. ధనుష్, ఐశ్వర్య ఒకరికొకరు చిట్ చాట్ చేయడంతో భార్యాభర్తలుగా విడిపోయినా..భవిష్యత్లో మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని కన్ఫామ్ చేసేశారు.
Congrats my friend @ash_r_dhanush on your music video #payani https://t.co/G8HHRKPzfr God bless
— Dhanush (@dhanushkraja) March 17, 2022
దీంతో అందరి ఊహాగానాలకు చెక్ పడినట్టైంది. ధనుష్ మాత్రమే కాకుండా రజనీకాంత్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, సెల్వ రాఘవన్ ఈ మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. పాయని మ్యూజిక్ వీడియోలో జానీ మాస్టర్,శ్రస్థి వర్మ లీడ్ రోల్స్ పోషించారు. అంకిత్ తివారీ మ్యూజిక్ కంపోజ్ చేయగా..అనిరుధ్ రవిచందర్ పాడాడు.
Thank you Dhanush….Godspeed https://t.co/XyP9lmnX3P
— Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) March 17, 2022