ఈ జనరేషన్ హీరోల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ధనుష్ పేరే వినిపిస్తుంది. ఆయన మంచి నటుడు, దర్శకుడు, కథకుడు, గాయకుడు కూడా. తన రీసెంట్ హిట్ ‘రాయన్’ తర్వాత మరోసారి ధనుష్ మెగాఫోన్ పట్టనున్నారు. సినిమా పేరు ‘ఇడ్లీ కడై’. ఆకాష్ భాస్కరన్ నిర్మాత. దర్శకుడిగా ధనుష్కి ఇది నాల్గవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ని గురువారం మేకర్స్ విడుదల చేశారు.
ఇడ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చునివుండగా, టైటిల్ను పరిచయం చేస్తూ ఈ పోస్టర్ ఉన్నది. తమ ప్రొడక్షన్ హౌస్ డాన్ పిక్చర్స్కు ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుందని, ధనుష్తో కలిసి తొలి ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు. ‘తిరుచిత్రాంబలం’ తర్వాత నిత్యామీనన్ మరోసారి ధనుష్తో జతకట్టనున్న ఈ సినిమాకు కెమెరా: కిరణ్ కౌశిక్, సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, నిర్మాణం: డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిల్మ్స్.