తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని హీరో ధనుష్ (Dhanush). క్లాస్, మాస్, స్టైలిష్..ఏ జోనర్ అయినా సరే తన యాక్టింగ్తో సినిమాపై క్రేజ్ పెంచేస్తుంటాడు ధనుష్. ఈ స్టార్ హీరో రీసెంట్గా మిత్రన్ ఆర్ జవహర్ డైరెక్షన్లో నటించిన తిరు (Thiru) చిత్రం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తిరు సినిమా సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ధనుష్.
కాగా ధనుష్ సర్ప్రైజ్ మైల్ స్టోన్ చేరుకున్నాడన్న న్యూస్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ట్విటర్లో ధనుష్ ఫాలోవర్ల సంఖ్య 11 మిలియన్లు దాటింది. ఈ అరుదైన మైల్ స్టోన్ చేరుకున్న మొదటి కోలీవుడ్ నటుడిగా ధనుష్ నిలువడం విశేషం. దక్షిణాది ఈ మార్క్ దాటిన రెండో యాక్టర్గా నిలిచాడు.
ధనుష్ ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో నాన్ వరువెన్ (Naan Varuven) చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. ఈ ఏడాది గ్రే మ్యాన్ ప్రాజెక్టుతో హాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు ధనుష్.