ఉప్పెన సినిమాతో దేవిశ్రీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఆసినిమా మ్యూజికల హిట్ గానూ నిలవడంతో మళ్లీ స్టార్ హీరోలంతా దేవి వెంట పడుతున్నారు. లేటెస్ట్ గా దేవిశ్రీ ని ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ అందివ్వబోతున్నాడని సినీనగర్ లో హాట్ న్యూస్ వినిపిస్తోంది.
కొరటాలతో కలిసి మళ్లీ తారక్ సినిమా చేయబోతున్నాడు. ఇంతకుముందు వీరి కాంబోలో జనతాగ్యారేజ్ వచ్చింది. ఆసినిమాకి దేవిశ్రీనే సంగీతం అందించాడు. ఇప్పుడు కూడా దేవినే మ్యూజిక్ డైరక్టర్ గా పెట్టుకోవాలని కొరటాల భావిస్తున్నాడు. ఇప్పటివరకు కొరటాల దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి దేవినే సంగీతం అందించాడు.
మెగాస్టార్ ఆచార్య కి కూడా ముందు దేవినే అనుకున్నారు. కానీ మణిశర్మని తీసుకోవాలని మెగా ఫ్యామిలీ సూచించడంతో కొరటాల కాదనలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి దేవినే తీసుకోవాలని భావిస్తున్నాడట. ఎన్టీఆర్ కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి దేవిశ్రీనే కన్ఫామ్ అవుతాడని సినీజనం చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకి చేస్తున్నాడు. అలాగే రామ్ పోతినేని- లింగుస్వామి డైరక్షన్ లో రాబోతున్న సినిమాకి కూడా దేవినే సంగీతం అందిస్తున్నాడు.