అగ్ర హీరో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తినిరేకెత్తిస్తున్నది. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. సోమవారం ఈ సినిమా ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేశారు. సముద్రం నేపథ్యంలోని పోరాట ఘట్టాలతో గ్లింప్స్ ఉత్కంఠగా సాగింది. ఎన్టీఆర్ రౌద్రరసపూరిత అభినయంతో ఆకట్టుకున్నారు. విజువల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో కనిపించాయి.
ఎర్ర సముద్రంలో ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ రక్తపాతం సృష్టిస్తూ ఫెరోషియస్ లుక్లో కనిపించారు ఎన్టీఆర్. ‘ఈ సముద్రం చేపల కంటే రక్తాన్నే ఎక్కువగా చూసింది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ప్రకాష్రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.