‘ఉయ్యాల జంపాల’ ‘ముజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విరించి వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను శనివారం దర్శకుడు దేవా కట్టా ఆవిష్కరించారు.
‘1980 దశకం నేపథ్యంలో తెలంగాణలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో నడిచే యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన హీరో వివరాలతో పాటు ఫస్ట్లుక్ను త్వరలో విడుదల చేస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వి.ఎస్.జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: నాగేంద్రకుమార్.