Janhvi Kapoor | బాలీవుడ్ చిత్రసీమలో కమర్షియల్గా భారీ సక్సెస్లు లేకపోయినా గుంజన్ సక్సేనా, గుడ్లక్ జెర్రీ, మిలీ వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్. కథాంశాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిచ్చే నాయికగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ భామ తెలుగులో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం ఈ అమ్మడు ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకోనుందని తెలిసింది. తెలుగులో ఈ భామకిది తొలి చిత్రమే అయినా హిందీలో ఉన్న పాపులారిటి దృష్ట్యా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని అంటున్నారు. ప్రస్తుతం అగ్ర కథానాయికలు సైతం సినిమాకు ఐదు కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో అరంగేట్ర చిత్రానికే జాన్వీకపూర్ ఐదు కోట్లు తీసుకోవడం విశేషమని చెబుతున్నారు. ఎన్టీఆర్- కొరటాల శివ చిత్రం మార్చిలో సెట్స్మీదకు వెళ్లనుంది.