హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘దీవాన’ విడుదల ఒకరోజు వాయిదా పడింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఒక్కరోజు ఆలస్యంగా ఈ నెల 20న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ప్రతి ఒక్కరిని మెప్పించే ప్రేమకథా చిత్రమిదని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్చంద్, ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజల, నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి.