కార్తీక్రాజు, నోయల్, మిస్తీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఎం.పూర్ణానంద్ దర్శకుడు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. సోమవారం ట్రైలర్ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కె.ఎల్.దామోదర ప్రసాద్, పాటలను జబర్దస్త్ ఆర్.పీ ఆవిష్కరించారు.
ఈ చిత్రాన్ని నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. సోషియో ఫాంటసీ అంశాలు కలబోసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్విస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ నెల 11న విడుదల చేయబోతున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, దర్శకత్వం: ఎం.పూర్ణానంద్.