హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దుండుగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి.. సైఫ్ను కత్తితో పొడిచాడు. దీంతో ఆయకు ఆరోచోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం లీలావతి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సినీ నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్పై దాడి తనను ఎంతగానో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Deeply Disturbed by news of the attack by an intruder on #SaifAliKhan
Wishing and praying for his speedy recovery.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 16, 2025
సైఫ్ సర్పై దాడి గురించి తెలిసి షాకయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇది నిజంగా బాధకరమని చెప్పారు. ఆయన త్వరతగతిన కోలుకోవాలని, క్షేమంగా తిరిగిరావాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. మరోవైపు అభిమానులు కూడా సైఫ్ క్షేమంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.
— Jr NTR (@tarak9999) January 16, 2025
ఫ్యామిలీ అంతా సేఫ్గా ఉన్నారంటూ.. దాడి ఘటనపై సైఫ్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) టీమ్ స్పందించింది. ‘నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని మిగిలినవారు అంతా సేఫ్గానే ఉన్నారు’ అని పేర్కొంది. ఈ మేరకు స్టేట్మెంట్ విడుదల చేసింది.