మనసుకు మాటకు మధ్య ఫిల్టర్ చాలా అవసరం. కానీ దీపిక పడుకోన్ను మాత్రం ఈ విషయంలో మినహాయించాలి. తన పద్ధతి వేరు. మనసులో ఏముందో అది స్ట్రైట్గా బయటకు రావాల్సిందే. మధ్యలో ఫిల్టర్ అంటూ ఉండదు. ఇటీవలే మొదలైన కరణ్జోహార్ టాక్ షోలో తన భర్త రణ్వీర్సింగ్తో కలిసి పాల్గొన్న దీపిక తన మనసుని పూర్తిగా ఆవిష్కరించేసింది. తన భర్త సాక్షిగానే తన జీవితంలో ఎదుర్కొన్న చాలా విషయాలను వెల్లడించింది.
‘రణవీర్కి ముందు ఇద్దరితో స్నేహంగా మెలిగాను. కానీ వాళ్లు నా అభిప్రాయాలను అస్సలు గౌరవించలేదు. అందుకే వాళ్ల స్నేహానికి గుడ్బాయ్ చెప్పేశాను. ఏ విషయంలోనూ నా పరిధులు దాటలేదు. అసలు రణ్వీర్ విషయంలోనూ తను ప్రపోజ్ చేసే వరకూ నేను మౌనంగానే ఉన్నాను. ఈ రోజు మేం ఒకరికోసం ఒకరం బతుకుతున్నాం. ఇప్పటికే వృత్తిరీత్యా నేను చాలామందిని కలుస్తుంటాను. కానీ నా గమ్యం రణ్వీర్.. నేను అతనికి కట్టుబడి ఉన్నాను. కలిసి బతకడం అంటే నమ్మకంతో బతకడం’ అంటూ చెప్పుకొచ్చింది దీపిక.