బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-కె’ ‘ఫైటర్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నటనతో పాటు బ్యాడ్మింటన్ క్రీడలో కూడా ఈ భామకు చక్కటి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. వీటితో పాటు తాను మిమిక్రీ కూడా బాగా చేయగలనని, ఎవరి గొంతునైనా ఇట్టే అనుకరిస్తానని దీపికా పడుకోన్ పేర్కొంది.
అయితే తన భర్త రణ్వీర్సింగ్, చెల్లెలు అనీషా ముందు మాత్రమే ఈ విద్యను బాగా ప్రదర్శిస్తానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఆ ఇద్దరి ముందు తప్ప మరెవరి దగ్గరైనా మిమిక్రీ చేయాలంటే గొంతు పెగలదు. ఇక కెమెరా ముందు అయితే భయపడిపోతాను. నాలోని ఈ రహస్య విద్య గురించి వారిద్దరి మాత్రమే బాగా తెలుసు’ అని చెప్పుకొచ్చింది.