సుమ చిత్ర ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘డియర్ ఉమ’ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్నారు. సాయిరాజేష్ మహదేవ్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి బైరెడ్డి సిద్థార్థ్ రెడ్డి క్లాప్నివ్వగా, ఏపీకి చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ కథతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు.
మనందరి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నా. చక్కటి సందేశంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. కన్నడంలో ‘దియా’ అనే చిత్రంలో నటించానని, తెలుగులో తనకిది తొలి చిత్రమని హీరో పృథ్వీ అంబర్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: రధన్, కథ, నిర్మాత: సుమయా రెడ్డి, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: సాయిరాజేష్ మహదేవ్.