Ramya Nambisan | ‘నా కెరీర్లో ఇంత వరకు ఇలాంటి ఇంటెన్స్, సీరియస్ పాత్రను చేయలేదు. ఓ లేడీ జర్నలిస్ట్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది చక్కగా చూపించారు. ‘దయా’ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అన్నారు రమ్య నంబీసన్. ఆమె నటించిన తాజా వెబ్సీరిస్ ‘దయా’. జేడీ చక్రవర్తి, ఈషారెబ్బా, కమల్ కామరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా రమ్య నంబీసన్ మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ ‘ ఈ కథ వినగానే షాక్ అయ్యాను. ఈ సిరీస్లో ప్రతీ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులకు ఎంతో ఉత్కంఠను పంచుతుంది. దయను చూస్తే ఖచ్చితంగా థ్రిల్ల్ అవుతారు. ‘పుష్ప’ సినిమా కోసం మలయాళంలో ‘ఊ అంటావా’ అనే పాట పాడాను. ఆ పాట అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఓటీటీ అనే ఫ్లాట్ఫామ్ రావడం వల్ల చాలా మంది నటీనటులకు అవకాశాలు పెరిగాయి. నిజంగానే ఓటీటీ అనేది ఓ గొప్ప పరిణామం’ అన్నారు.