నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘దసరా’ చిత్రంతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సింగరేణి నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వందకోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తదుపరి చిత్రమేమిటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, ఎన్టీఆర్ల కోసం ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై శ్రీకాంత్ ఓదెల స్పందించారు. ప్రభాస్, ఎన్టీఆర్ల కోసం తాను కథ సిద్ధం చేస్తున్నాననే వార్తల్లో నిజం లేదని, తదుపరి సినిమా కూడా నానితోనే చేయబోతున్నానని తెలిపారు. యాక్షన్ కథాంశమిదని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.