శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవలే రెండో షెడ్యూల్ను మొదలుపెట్టారు. 25 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. ఇందులో నటి బిందుమాధవి వేశ్యగా కీలక పాత్ర పోషిస్తున్నారు. భావోద్వేగభరితంగా, ఆలోచింపజేసేలా ఆమె పాత్ర ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
శివాజీతోపాటు బిందుమాధవి కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని మేకర్స్ తెలిపారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ, గ్రామల్లో భూస్వాముల దౌర్జన్యాలపై సామాన్యుల తిరుగుబాటును చూపించే చిత్రమిదని, చక్కటి హాస్యం.. వ్యంగ్యంతో పాటు హృదయాన్ని కదిలించే ఉద్వేగాలుంటాయని మేకర్స్ తెలిపారు. నవదీప్, నందు, రవికృష్ణ, మణిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ ఆర్ రాబిన్, దర్శకుడు: మురళీకాంత్.