రాజీవ్ సాలూరి, దీప్సిక జంటగా నటించిన చిత్రం ‘ఆఖరి ముద్దు’. సీవీ ఆర్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. దర్శక నిర్మాత సీవీ రెడ్డి మాట్లాడుతూ…‘ఈ కథ నన్ను చాలా ప్రభావితం చేసింది. సమాజానికి మార్గదర్శనం కావాలనే ఆశతో ఈ సినిమాను రూపొందిస్తున్నాను‘ అన్నారు. సీత, కాకరాల, పృథ్వీ, పవిత్ర లోకేష్, పోసాని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కోటి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ : మౌళి.