కరోనా సెకండ్వేవ్ చిత్రసీమను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలువురు సినీ తారలు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘పరీక్షలో నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నా. మా కుటుంబమంతా ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల్ని పాటిస్తున్నాం. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. అందరు సురక్షితంగా ఉండండి’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.