కొడంగల్, మే 30: కరోనా కట్టడిలో భాగంగా ప్రభు త్వం మూడు రోజుల నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, కొడంగల్ సీహెచ్సీలో 132 మందికి వ్యాక్సినేషన్ వేశామని వైద్యాధికారి డాక్టర్ వీణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ కొడంగల్ సీహెచ్సీ పరిధిలో మొత్తంగా 161 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించారన్నారు. ఇందులో మొదటి రోజు 50మందికి, రెండో రోజు 66 మంది, మూడో రోజు 16 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. మిగతా 29 మందిలో కొంతమంది ఇదివరకే మొదటి డోస్ తీసుకున్నారని, స్థానికంగా లేకపోవడం, కొవిడ్ పాజిటివ్ రావడం తదితర కారణాలకు గాను వ్యాక్సిన్ అందించడానికి వీలుపడలేదన్నారు.
మోమిన్పేటలో..
మోమిన్పేట, మే, 30: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సి న్ పంపిణీ కార్యక్రమం మూడో రోజూ కొనసాగింది. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆదివారం మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సూపర్ స్ప్రెడర్లు 10 మందికి టీకాలు ఇచ్చినట్లు వైద్యాధికారి సుధీర్ బాబు సూచించారు.