టాలీవుడ్ సీనియర్ కోడైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కరోనాతో కొద్దిరోజులుగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం ఉదయం ప్రాణాలు విడిచారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందించినప్పటికీ బతికించలేకపోయారు. సత్యం మరణ వార్తతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా షాక్ కి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.
దర్శకత్వ విభాగంలో పనిచేసిన సత్యం ఎన్నో సినిమాలకు పని చేశారు. ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర ఆయన సహాయకుడిగా పని చేశారు. ఆ దర్శకులు తెరకెక్కించిన ఎన్నో భారీ హిట్ సినిమాల్లో భాగం అయ్యారు.