హైదరాబాద్ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం(70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. జయరాం స్వస్థలం వరంగల్. సినీరంగం మీద ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే చెన్నై వెళ్లి సినిమాటోగ్రాఫర్గా స్థిరపడ్డారు.
అనేక మలయాళం, తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు లాంటి ప్రముఖ హీరోల సినిమాలకు పనిచేశారు.
మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. అనేక విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసి పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీరంగ ప్రముఖులు జయరాం మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.