‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు జీవన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ..‘నా గత చిత్రాలకు భిన్నంగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే చిత్రమిది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంటుంది. చోర్ బజార్కు నేను వెళ్తుండేవాడిని. అకడి మనుషుల స్వభావం ఆకట్టుకుంది. వాళ్లు వస్తువులు దొంగతనం చేయరు. మనం వద్దనుకుని పడేసిన వస్తువులను సేకరించి అకడ తకువ ధరలకు అమ్ముతుంటారు.
ఏమాత్రం గుర్తింపు లేని మనుషులు వారు. ఆధార్ కార్డులు కూడా ఉండవు. వాళ్లను అడిగితే మాకు ఓటు హకు లాంటి కనీస గుర్తింపు లేదని బాధపడుతుంటారు. ఇలాంటి అంశాల్ని సినిమాలో ప్రస్తావించాం. హీరోకు బచ్చన్ సాబ్ అనే పేరు పెట్టాం. రికార్డుల కోసం తాను చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఫుల్ కమర్షియల్గా సాగుతుంటాయి. నాయికకు మూగ పాత్ర ఇవ్వడానికి కారణం.. ఆమెకు మాట్లాడటం రాకున్నా ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ద్వారా మాట్లాడించాం. తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సినిమాల డైలాగ్స్ వినిపిస్తూ చెబుతుంది.
సినిమా ప్రధానంగా లవ్స్టోరి అయినా..ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. వంద కోట్ల రూపాయల విలువైన డైమండ్ పోయినా అది చోర్ బజార్లో ప్రత్యక్షమవుతుంది. కానీ అకడి వాళ్లకు దాని విలువ తెలియదు. పది రూపాయలకే అమ్ముతుంటారు. ఈ డైమండ్ చుట్టూ డ్రామా, ఫన్ క్రియేట్ అవుతాయి. ఆకాష్ పూరి నేను అనుకున్న పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. అతను పర్పెక్ట్గా బచ్చన్ సాబ్ పాత్రను పోషించాడు. నాకు సక్సెస్ను క్యాష్ చేసుకోవడం రాదు. జార్జ్ రెడ్డి తర్వాత ఆ క్రేజ్ను ఉపయోగించుకోలేదని మిత్రులు అంటుంటారు. ప్రతి సినిమాకు పూర్తి అంకితభావంతో పనిచేస్తుంటాను. త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఆ వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తా. అన్నారు.