భారతీయ పురాణ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెలుగులో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘జర్నీ టూ అయోధ్య’ పేరుతో చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై నిర్మాత వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు వి.ఎన్.ఆదిత్య కథనందిస్తుండగా, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఓ యువ దర్శకుడు తెరకెక్కిస్తారని, నటీనటులు..సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.