యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం. ఇటీవల కలిసిన వారు పరీక్షలు చేయించుకోండంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న సమయంలో చిరు తన ట్వీట్ ద్వారా ఫ్యాన్స్కు సంతోషకరమైన వార్త చెప్పారు.
కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.అతను, వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు .తను చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్గా ఉన్నారని తెలుసుకుని నేను చాలా సంతోషించాను .త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ తారక్ అంటూ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో కొమరం భీమ్గా నటిస్తున్నారు ఎన్టీఆర్.ఇందులో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.