“స్వాతిముత్యం’ సినిమాకు అన్ని కేంద్రాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రిలీజ్ ముందు చిరంజీవిగారు మా టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు స్వాతిముత్యం, గాడ్ఫాదర్ రెండు చిత్రాలు సక్సెస్ కావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆయన నిర్మించిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె కృష్ణ రూపొందించారు. శుక్రవారం ఏ ర్పాటు చేసిన సక్సెస్మీట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఆడియెన్స్తో పాటు యువత చక్కటి ఆదరణ కనబరుస్తున్నారు.
ఈ వారాంతానికి వసూ ళ్లు మరింత పెరిగే అవకాశముంది. ఈ సినిమా విష యంలో మా అంచనాలన్నీ నిజ మయ్యా యి’ అన్నారు. ‘నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించడం ఆనందంగా ఉంది. ఈ విజయానందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ఇలాం టి మంచి సినిమాను అందించిన సితార నాగవంశీగారికి జీవితాంతం రుణపడి ఉంటా’ అని బెల్లంకొండ గణేష్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా కథ మన మధ్యలో జరిగినట్లు చాలా సహజంగా ఉందని ప్రశంసలొస్తున్నాయి. ఓ సాధారణ కుటుంబంలో ని సమస్యను తీసుకొని ఈ సినిమా చేశాం. అందుకే అందరికి కనెక్ట్ అవుతుంది’ అని పేర్కొన్నారు. సినిమా చూసిన ప్రేక్షకులందరూ హాయిగా నవ్వుకుంటూ బయటకు రావడమే చిత్ర విజయానికి నిదర్శనమని కథానాయిక వర్ష బొల్లమ్మ చెప్పింది.