హైదరాబాద్: దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. తీవ్రఅనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్లోని నివాసానికి తరలించారు. అక్కడ కృష్ణంరాజు భౌతికకాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ దర్శకులు రాఘవేంద్ర రావు నివాళులర్పించారు. నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజు, నటులు మురళీ మోహన్, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్బాబు, అజయ్, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. హీరో ప్రభాస్ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.