స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తున్నది. వచ్చే సంక్రాంతి పండుగకు ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించగా…తేదీ మాత్రం వెల్లడించలేదు. సంక్రాంతికి ఒక రోజు ముందే 13వ తేదీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారట. 13న శుక్రవారం కావడంతో సినిమా విడుదలకు సాంకేతికంగా, సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తుండగా..అతిథిగా మరో ముఖ్య పాత్రలో హీరో రవితేజ కనిపించనున్నారు. చిరంజీవి, రవితేజ కలిసి ఓ మాస్ బీట్కు డ్యాన్సులు చేయబోతున్నారు. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేయగా…ప్రస్తుతం మూవీ టీజర్ రూపకల్పనలో దర్శకుడు బాబీ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే టీజర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.