సోదరసోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్). నేను నీకు రక్ష..నువ్వు నాకు రక్ష..మనిద్దరం దేశానికి రక్ష అంటూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ కట్టుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. రాఖీ పౌర్ణమి (Raksha bandhan) వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. సామాన్యులతోపాటు సినీ ప్రముఖులు రక్షాబంధన్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ కట్టించుకోవటమే కాదు..రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లకి మాటివ్వాలి. నా సోదర సోదరీమణులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు…అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రాఖీ కట్టించుకోవటమే కాదు.రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు,
అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి.
నా సోదరసోదరీమణులందరికి
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.Happy #rakhibandhan
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 11, 2022
చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ను సిల్వర్ స్క్రీన్పై చూపించబోతున్నాడు డైరెక్టర్ మెహర్ రమేశ్. చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్ నటిస్తోంది.