మెగాస్టార్ చిరంజీవి తాలూకు వింటేజ్ కామెడీ చూసి చాలా రోజులైందని ఆయన అభిమానులు కొన్నేళ్లుగా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆ లోటుని పూడ్చడానికేనంటూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో చిరు తనదైన మార్క్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవితో నయనతార జోడీ కట్టడం మరో ఆకర్షణ. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘మీసాల పిల్ల’ అంటూ సాగే తొలిగీతాన్ని మంగళవారం విడుదల చేశారు. భీమ్స్ స్వరపరచిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ‘ఏ మీసాల పిల్ల..నీ ముక్కుమీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల..పొద్దుల్నేచిన దగ్గరి నుంచి రోజూ యుద్ధాలా..మొగుడూ పెళ్లాలంటేనే కంకీకొడవళ్లా..’ అంటూ ఈ పాట సాగింది.
ఈ పాటలో చిరంజీవి ైస్టెలిష్గా కనిపిస్తు తనదైన సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్తో అలరించారు. విజయ్ పొలాకి అందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. మొత్తానికి మెగాభిమానులకు ఓ విజువల్ ట్రీట్లా పాట మెప్పించింది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.