ప్రతిభ ఉన్న వారిని మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని చిరు తన ఇంట్లో సత్కరించారు.ఈ కార్యక్రమానికి నాగార్జున, రానా,రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, శర్వానంద్, హీరోయిన్స్ రాధిక, సుహాసినితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సినీ ప్రముఖుల మధ్య మెగాస్టార్, అల్లు అరవింద్ తదితరులు సింధును సత్కరించి అనంతరం ఆమె సాధించిన మెడల్తో వారంతా ఫొటోలు దిగారు. ఇందుకుసంబంధించిన వీడియోని చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు.
పలువురు సెలబ్రిటీలు సైతం పీవీ సింధుని కలవడం సంతోషాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమం జరిగి చాలా రోజులు కాగా, చిరు తాజాగా వీడియో షేర్ చేశారు. వారం క్రితం రాధికా తన ట్విట్టర్లో పీవీ సింధుతో దిగిన పిక్స్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటానన్న సింధు.. వచ్చే ఒలింపిక్స్లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.