Srithi Haasan | సంక్రాంతి పోరు సిద్ధమైంది. నువ్వా నేనా అనే విధంగా పోటీ రసవత్తరంగా సాగుతుంది. ప్రతీ సంక్రాంతికి ఉండే పోటీనే అయినా ఈ సారి కాస్త మసాలా ఘాటు ఎక్కువైంది. ఓ వైపు బాలయ్య ‘వీరసింహారెడ్డి’తో, మరోవైపు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి మరింత హీట్ పెంచుతున్నారు. ఇప్పటికే వీరి సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, పాటలు ఇలా ఏది వచ్చినా.. ప్రేక్షకులు రెండింటిని కంపేర్ చేయడం మొదలు పెట్టారు. హీరోల సంగతేమో గానీ, అభిమానులు మాత్రం సై అంటే సై అనే విధంగా ఒకరి ఫ్యాన్స్ మీద మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరిని హీరోయిన్ సెంటిమెంట్ భయపెడుతుంది.
హీరోయిన్ సెంటిమెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? చిరు, బాలయ్య ఇప్పటి వరకు ఏన్నో సార్లు సంక్రాంతికి పోటీ పడ్డారు. అందులో కొన్ని సార్లు, చిరు నెగ్గితే.. మరికొన్ని సార్లు బాలయ్య పై చేయి సాధించాడు. అయితే రెండు సార్లు మాత్రం ఈ ఇద్దరూ హీరోలు ఒకే హీరోయిన్తో పోటీకి వచ్చారు. 1988లో చిరు ‘మంచిదొంగ’, బాలయ్య ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ సినిమాలతో సంక్రాంతికి పోటీ పడ్డారు. ఈ రెండు సినిమాల్లో విజయ శాంతి హీరోయిన్గా నటించింది. కాగా అప్పుడు చిరు పై చేయి సాధించాడు. మళ్ళీ 13ఏళ్ళకు వీరిద్దరూ కలిసి ఒకే హీరోయిన్తో పోటీపడ్డారు. బాలయ్య ‘నరసింహా నాయడు’తో రాగా, చిరు ‘మృగారాజు’తో వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సారి మాత్రం బాలయ్య విజయం సాధించాడు.
ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సారి వీరిద్దరూ కలిసి ఒకే హీరోయిన్తో పోటీ పడనున్నారు. ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’లో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. మరీ ఆ హీరోయిన్ సెంటిమెంట్ ఇప్పుడు ఏ హీరోకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని వీర సింహా రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి టైటిల్ వరకు ప్రతీది ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత ఆ తరహాలో ‘వాల్తేరు వీరయ్య’ తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. దానికి తోడు రవితేజ కూడా ఈ సినిమాలో భాగం అవడం సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇక ఈ రెండు సినిమాలను మైత్రీ సంస్థ నిర్మించడం గమనార్హం. వీటితో పాటుగా సంక్రాంతి పోరుకు ‘వారసుడు’, ‘తునివు’, ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలు రిలీజ్ కానున్నాయి.