Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’(Chhaava). ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు (Chhatrapati Shivaji Maharaj) శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కేవలం హిందీలోనే రూ.750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. భారీ వసుళ్లను సాధించింది. అయితే ఈ సినిమాను పార్లమెంట్లో స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నట్లు తెలుస్తుంది.
మార్చి 27న పార్లమెంట్లో ఛావా సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతుండగా.. ఈ స్క్రీనింగ్కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించింది.