వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. వెంకట్ కళ్యాణ్ దర్శకుడు. క్రాంతి కిరణ్ నిర్మాత. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం టీజర్ను నటుడు సునీల్ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తి వినోద్మాతకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తాయి. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.