Ratnam Movie |విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నది. శ్రీసిరి సాయి సినిమాస్ పతాకంపై సీహెచ్ సతీష్కుమార్, కే.రాజ్కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో వేగం పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెబుతావా’ అంటూ సాగే మెలోడియస్ గీతాన్ని విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, సింధూరి విశాల్ అలపించారు. ‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. విశాల్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.